ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లైగర్' మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 27, 2021, 01:32 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'లైగర్'. రీసెంట్‌గా ఈ మూవీ గోవాలో మళ్లీ మొదలైంది. ఈ సినిమా షూటింగ్‌లో నట సింహా బాలకృష్ణ కూడా సడెన్ విజిత్ చేసిన చిత్ర యూనిట్‌ను సర్‌ఫ్రైజ్ చేశారు. టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  డైరెక్షన్‌లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో 'లైగర్' మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌ లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో మాత్రమే కాకుండా భారత్‌లోని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నారు. లైగర్ అంటే సింహం, పులికి పుట్టిన జంతువును లైగర్ అని పిలుస్తారు. తెలుగు, హిందీతో పాటు మిగతా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాకు రూ. 200 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి.


 


కానీ విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ మాత్రం ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 'లైగర్' చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట.అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. తెలుగు తమిళ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఇవ్వనున్నాు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది.


 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa