ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' డిజిటల్ ఎంట్రీ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 09:28 AM

అల్లరి నరేష్ 59వ చిత్రంగా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఆడియన్స్ నుండి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆనంది హీరోయిన్ గా నటించింది. AR మోహన్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.


లేటెస్ట్ గా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం డిజిటల్ ఎంట్రీ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 23 నుండి ప్రముఖ ఓటిటి జీ 5 లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుందని సదరు సంస్థ అధికారిక ప్రకటన చేసింది.


హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలకపాత్రల్లో నటించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com