డీజే సినిమాకి ముందు తెలుగులో రెండుమూడు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేకి పెద్దగా ఫేమ్ అయితే రాలేదు. కానీ దువ్వాడ జగన్నాధం సినిమా ఫ్లాప్ అయినా.. పూజా బికినీ వలన ఆమెకి మేలే జరిగింది. ఆ ఒక్క సినిమా పూజా హెగ్డే కెరీర్ ని మలుపుతిప్పింది. ఆ సినిమాలో బికినీ దెబ్బకి పూజా హెగ్డే ముందు స్టార్ హీరోల అవకాశాలు వెల్లువలా రావడం అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన అరవింద సమేత ప్రేక్షకుల ముందుకు రావడం జరిగిపోయాయి. అరవింద సమేతలో టైటిల్ రోల్ పోషించిన పూజా హెగ్డేకి ఆ సినిమాతో ఒరిగింది లేదు.. తరిగింది లేదు. ఇక మహేష్ తో మహర్షి సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. అలాగే మరో స్టార్ హీరో ప్రభాస్ పక్కన జిల్ రాధాకృష్ణ దర్శకతంలోనూ నటిస్తుంది ఈ చిన్నది. అయితే ఈ మధ్యన పూజా హెగ్డే కబుర్లు మీడియాలో కనబడటం లేదు.. వినబడడం లేదు.
మహర్షి, ప్రభాస్ సినిమాల షూటింగ్స్ తో పాటు బాలీవుడ్ లోనూ నటిస్తున్న పూజా హెగ్డే ఎంత బిజీగా గడిపినా సోషల్ మీడియాలో అందుబాటులో ఉండేది. కానీ ఈ అమ్మడు అరవింద సమేత తర్వాత బయట పెద్దగా ఫోకస్ అవడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ లో ఒక ఫ్యాషన్ షో ఓపెనింగ్ లో తళుక్కుని మెరిసింది పూజా హెగ్డే. బాలీవుడ్ లో భారీ ఫ్యాషన్ షో అయిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2019 డే వన్ లో పూజా హెగ్డే అదిరిపోయే డ్రెస్ లో అదరగొట్టేసింది. టబు, కరణ్ జోహార్ లాంటి బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ పాల్గొన్న ఈ ఫ్యాషన్ వీక్ లో పూజా హెగ్డే అందంగా హాట్ గా ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న ఆ హాట్ అండ్ క్యూట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa