బాలీవుడ్ కండల వీరుడు అజయ్ దేవగణ్ ఇంట విషాదం అలుముకుంది. ఆయన తండ్రి వీరూ దేవగణ్ ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన, ఈ రోజు ముంబైలోని సూర్య హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతిచెందారు. వీరూ దేవగణ్ బాలీవుడ్లో 80కిపైగా భారీ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రఫర్గా పనిచేశారు. యాక్షన్ సినిమాలకి ఆయనైతేనే న్యాయం చేయగలరు అనేంత ముద్రవేశారు. నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. స్టంట్ మాస్టర్గా, నిర్మాతగా తనదైన ముద్రవేసిన ఆయన కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి అక్కడా సక్సెస్ అయ్యారు.
అజయ్ దేవగణ్తో ‘హిందుస్థాన్ కీ కసమ్’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. తెరపై యాక్షన్ హీరోగా అజయ్ దేవగణ్ ఎదగడం వెనుక, తండ్రిగా ఆయన కృషి చాలా వుంది. అజయ్ దేవగణ్ను హీరోగా నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు. కొడుకు ఎదుగుదలలో కీలకమైన పాత్రను పోషించారు వీరు దేవగణ్. ఆయన మృతివార్త తెలిసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విలే పార్లే శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa