|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 05:15 PM
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు చేపట్టిన ఆందోళన ఘర్షణకు దారితీసింది. ప్రిన్సిపల్ అక్రమాలకు పాల్పడుతున్నారని, తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు పట్టణ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనను అదుపు చేసేందుకు యత్నించిన ఓ మహిళా కానిస్టేబుల్పై విద్యార్థినులు దాడి చేశారు.వివరాల్లోకి వెళితే, కళాశాల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్కు, విద్యార్థినులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆమె ఓ విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది.ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థినులు ఏకమై మహిళా కానిస్టేబుల్పై తిరగబడ్డారు. "న్యాయం చేయమని అడిగితే మమ్మల్నే కొడతారా?" అంటూ పోలీసులను నిలదీశారు. ఈ అనూహ్య పరిణామంతో పోలీసులు, స్థానికులు నిశ్చేష్టులయ్యారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి తమ సమస్యలు విని, పరిష్కారం చూపే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థినులు తేల్చిచెప్పారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కొందరు విద్యార్థినులను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో షాద్నగర్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.