ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతును తొక్కి చంపిన ఏనుగు.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 08:01 PM

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలపై దాడులు చేస్తూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. పొలానికి వెళ్లిన రైతులపై కూడా దాడులు చేసి చంపేస్తున్నాయి. తాజాగా.. పెంచికలపేట మండలం కొండపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతును ఏనుగు తొక్కి చంపేసింది.


వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పోషన్న నీరు పెట్టేందుకు పంట పొలానికి వెళ్లాడు. అయితే అక్కడకు వచ్చిన ఏనుగు ఆకస్మాత్తుగా పోషన్నపై దాడి చేసింది. అతడిని కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ ఘనటలో పోషన్న అక్కడిక్కడే మృతి చెందాడు. కాళ్లు, చేతులు, నడుము మడతపెట్టినట్లుగా తొక్కటంతో స్పాట్‌లోనే చనిపోయాడు. పోషన్నను ఏనుగు తొక్కి చంపిన తీరును చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.


తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి మండలంలోనూ ఓ రైతుపైనా ఏనుగు దాడి చేసి చంపేంసింది. అల్లూరి శంకర్ అనే రైతుపై బుధవారం (ఏఫ్రిల్ 3) దాడి చేసి తొక్కి చంపింది. ఈఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఏనుగు మరొకరిని చంపేయటంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగు సమీప గ్రామాల్లోనే తిరుగుతుండటంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఏనుగును బంధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa