సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదలకు న్యాయం జరగడం లేదంటూ సొంత పార్టీ నేతే వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ దొరల పాలనే వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలపై అధికారులు పట్టించుకోవడం లేదని.. బడుగు బలహీనర్గాల పాలన రావాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇందిర గాంధీ పాలనలో మాదిగలకు 94 ఎకరాల భూమిని ఇచ్చామని.. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగి కృష్ణరెడ్డి దురుద్దేశంతో చనిపోయిన వారి సంతకాలు పోర్జరీ చేసి పట్టాలు చేయించుకున్నారంటూ వీహెచ్ ఆరోపించారు. ఈ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని.. అయినా సరే హెచ్ఎండీఏ అధికారులు పర్మిషన్ ఇచ్చారంటూ మండిపడ్డారు.
ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఏం చర్యలు తీసుకోవడం లేదని హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల్లో జరుగుతున్న పనులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. "ఏం ప్రభుత్వం రా బాబు ఇది.. పేదలు భూములు కోల్పోయి రోడ్ల మీద తిరుగుతున్నారు.. విల్లాలు కట్టి మూడు కోట్లకు ఒక్కో విల్లాను అమ్ముతున్నారు.. మా ప్రభుత్వం వస్తే ఎవరి భూమి వారికే అన్నారు.. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది." అంటూ సొంత పార్టీ ప్రభుత్వాన్నే వీహెచ్ నిలదీశారు. వందల కోట్ల స్కాం జరుగుతుందని వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. స్లోగన్ బాగుంది కానీ న్యాయం జరగడం లేదని ప్రజలు అంటున్నట్టు వీహెచ్ తెలిపారు.
రెవెన్యూ శాఖ అధికారులు తప్పులు చేస్తారు.. తాము కోర్టుల చుట్టూ తిరుగాలా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వీహెచ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది నిజంగా ఇందిర గాంధీ ప్రభుత్వం అయితే పేదల భూములు పేదలకు ఇవ్వాలి.. పది రోజుల్లో దీనిని ప్రభుత్వం తేల్చాలని.. లేదంటే ఆ భూమిలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పుకొచ్చారు. పేదలకు న్యాయం జరగకపోతే నక్సలైట్లుగా మారుతారని హెచ్చరించారు. ఇది 5 వందల కోట్ల స్కాం అని.. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే రేవంత్ రెడ్డికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని వీహెచ్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa