సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తుంటారు. మాగ్జిమం రిటైల్ ఫ్రైస్ (MRP) ధరలకే వస్తువులు అమ్మాలని ప్రభుత్వం చెబుతున్నా.. డబ్బులకు ఆశపడి అధిక ధరలకు విక్రయిస్తారు. ఇదేమని అడిగితే కొందరు వ్యాపారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు. ఇక ఇటీవల కాలంలో నాసిరకం వస్తువులు కూడా అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తున్నారు. ఇలా ఎక్కువ ధరలకు వస్తువులు అమ్మటం, నాణ్యత లేనివి ప్రజలకు అంటగట్టడం వంటివి చేసినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటివి జరిగినపుడు మనం నేరుగా వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. నేరుగా ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే మన ఫిర్యాదులు అందించవచ్చు. అందుకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా 'వాట్సప్ చాట్బాట్' సేవలను తీసుకొచ్చింది. నాణ్యతలేని వస్తువులు, ఎక్కువ ధరకు అమ్మితే వాట్సప్ నెంబర్ 88000 01915 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొదట ఆ నెంబర్కు హాయ్ అని టైప్ చేయాలి. అక్కడ కనిపించే సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్లైన్లో మీ కంప్లైంట్ నమోదవుతుంది.
అనంతరం మీ కేసు పరిష్కారం కోసం ఈ వివరాలను స్థానికంగా ఉండే జిల్లా వినియోగదారుల కమిషన్కు వారే పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు వాట్సాప్ ద్వారా మీకు అందిస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్కు కాల్ చేసి సైతం ఫిర్యాదు చేయొచ్చు. ఈ నెంబర్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రోజూ వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతుంటాయి. అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ https:/consumerhelpline.gov.in/ వెబ్సైట్లో పొందు పరుస్తుంది. 'ఎన్సీహెచ్ సక్సెస్ స్టోరీస్' పేరుతో వెబ్సైట్లో ఆ వివరాలు కనిపిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు అలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వాట్సాప్లో ఫిర్యాదు చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa