నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం రూపొందించిన వికలాంగుల వాయిస్ మాస పత్రికను ఆవిష్కరించారు. మాస పత్రిక తేవడం పట్ల ఆయన ఆ సంఘం నాయకులను అభినందించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల బాలీశ్వర్, ఆనంద్, కుర్మయ్య, లింగం గౌడ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa