ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండాలుగా వ్యవహరిస్తున్న పోలీసులు..చోద్యం చూస్తున్న ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 03:07 PM

పోలీసులు గూండాలుగా వ్యవహరిస్తూ  న్యాయవాదులపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కూకట్ పల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సంతోష్ అనే న్యాయవాదిపై బోరుబండ ఇన్స్ స్పెక్టర్  జమాల్ అకారణంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అడ్వకేట్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనగా సోమవారం మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


పోలీసులు అకారణంగా న్యాయవాదులపై దాడులు చేస్తుంటే పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇంట్లో లుంగి, బనియన్ పై ఉన్న సంతోష్ అనే న్యాయవాదిని ఒక తీవ్రవాదిలాగా ఇన్స్ స్పెక్టర్ జమాల్ ఈడ్చి కెళ్ళి దాడి చేశాడని పేర్కొన్నారు. ఇన్స్ పెక్టర్ జమాల్ తో పాటు ఇటీవల న్యాయవాదులపై దాడులు చేసిన పోలీసులందరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిజిపి తో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాంబాబు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, న్యాయవాదులు వెంకట నర్సయ్య, వడ్డేపల్లి శ్రీనివాస్, రాజ్ మహమ్మద్, ఒజ్జెల శ్రీనివాస్, హఫీజ్, సుధాకర్, ఆనంద్, గంగాధర్, ప్రభాకర్, రాజిరెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa