కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై సభ్య సమాజం తలదించు కునే విధంగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బూర మనోజ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రూరల్ మండలంలోని ముత్తగూడెంలో అత్యాచార ఘటనను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అత్యాచార నిందితులను గుర్తించి వారికి ఉరిశిక్ష విధించి మరో మారు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరారు. నిత్యం మహిళలపై అగాయిత్యాలు జరుగుతున్న ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. మహిళలపై దాడులు వ్యక్తులను శిక్షించేందుకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని అయన డిమాండ్ చేశారు. కన్న కూతుర్ని కోల్పోయిన వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాతి పవన్, మేడిద శివ, చమకూరి మహేష్ , బూర నవీన్, బూర మహేష్, మనోహర్, నాతి మహేష్, బూర సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa