యాసంగి వరకల్లా దుబ్బాక నియోజకవర్గం లో సాగునీటి గోస లేకుండా చర్యలు తీసుకోవాలని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కరువు కాటకాల మూలంగా దుబ్బాక నియోజకవర్గం లో రైతుల జీవితాలు ఆగమాయ్యాయని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయడానికే నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందన్నారు. నేడు ప్రాజెక్టు ల్లో నిండా నీళ్లు ఉన్నాయని, వాటిని ప్రతి ఎకరాకు అందించేలా ప్రధాన, ఉప కాలువలను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.. తాను ఎమ్మెల్యే గా గెలిచిన కొద్ది రోజుల్లోనే నియోజకవర్గం లోని కాలువలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలని కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. శంకరంపేట కాలువకు సంబంధించి అహ్మధ్ షా పూర్, ఇబ్రాహీంపూర్, వల్లూరు వద్ద అటవీ నుండి వెళ్లే కాలువ నిర్మాణం కోసం అటవీ శాఖ వారు సహకరించాలని కోరారు. ప్రధాన కాలువలు, ఉప కాలువల కోసం పలు ప్రాంతాల్లో రైతులు అడ్డుకుంటున్నారని, దయచేసి సాటి రైతులకు సాగునీటి సౌకర్యం కోసం సహకరించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, పెద్దలు, రైతులు కాలువ నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు..చాలా గ్రామాల్లో పాత పరిహారం కోసం రైతులు ఒప్పుకోవడం లేదని, చెక్కులు తీసుకోవడం లేదని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం ఉన్న పరిహారం అందేలా చూడాలన్నారు.
ఉప కాలువలకు భూసేకరణ కోసం రెవిన్యూ అధికారులు యుద్ధప్రాతిపాధికన చర్యలు తీసుకోవాలన్నారు..ప్రధాన కాలువలు పూర్తి అయినప్పటికీ ఉప కాలువలు నిర్మించకుంటే చెరువు కుంటల్లోకి, పొలం లోకి సాగునీళ్లు అందించే అవకాశం ఉండదన్నారు.. కాలువల నిర్మాణం కు తీసుకోవాల్సిన చర్యల గురుంచి అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమం లో డిఇ లు బుచ్చయ్య, జీవన్, నరేష్, బాలకృష్ణ, ఏఇ లు ప్రసాద్, ప్రదీప్ రెడ్డి, ప్రకాష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa