అందోలులో చేపడుతున్న అభివద్ది పనుల్లో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా సుమారుగా రూ.100 కోట్లకు పైగా పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు.అందోలు శివారులోని సర్వేనంబర్లోని ప్రభుత్వ భూమిలో రూ.60 కోట్లతో 150 పడకల ప్రభుత్వాసుపత్రిని, రూ.43 కోట్లతో నర్సింగ్ కళాశాల భవనం పనులకు మంత్రి శంకుస్థాపన చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా భవనాలకు సంబంధించిన శిలాఫలకాలను సిద్దం చేశారు. నర్సింగ్ కళాశాల తరగతులను పీజీ కళాశాలలో కొనసాగించేందుకు సిద్దం చేసిన భవనాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ తరగతుల ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నర్సింగ్ కళాశాల భవనంను పరిశీలించిన మంత్రి నర్సింగ్ కళాశాల తరగతులను తాత్కాలికంగా నిర్వహించేందుకుగాను పీజీ కళాశాల భవనాన్ని బుధవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. భవనంలోని తరగతి గదులను, కొత్తగా మంజూరైన ఫర్నిచర్ను ఆయన పరిశీలించారు. నాణ్యత లేని పనులను పరిశీలించి మంత్రి తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేశారు. సంబంధిత ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పగుళ్లను సరిచేయాలని ఆదేశించారు. నర్సింగ్ కళాశాలకు సంబంధించిన సిబ్బంది వివరాలను ప్రిన్సిపాల్ పద్మను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో పాండు, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ తిరుపతి, మార్క్ ఫేడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి, తహశీల్దార్ విష్ణుసాగర్, డిప్యూటీ తహశీల్దార్ మధుకర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు ఎస్.సురేందర్గౌడ్, ఆకుల చిట్టిబాబు, రంగ సురేష్, డి.శంకర్, హరికష్ణాగౌడ్, చందర్, దుర్గేష్, మాజీ కౌన్సిలర్లు పి.ప్రవీణ్కుమార్, రామకష్ణ, ప్రదీప్గౌడ్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa