ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 03:22 PM

వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్  చేవెళ్ల నియోజకవర్గం, నవాబ్ పేట లో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులతో ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసిందన్నారు. అన్ని రకాలుగా మోసపోయిన ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం మీద ఆవేశంతో రగిలిపోతున్నారన్నారు.
అప్పట్లో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పక్కన పెడుతుందని చెప్పిన మాటలను గుర్తు చేశారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్ర ప్రజలు మళ్ళీ కెసిఆర్ నే కోరుకుంటున్నారన్నారు, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే  బీ ఆర్ ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa