ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్కడినుండో తీసుకువచ్చి ఇక్కడ యాసిడ్ డంపింగ్ చేయడమేంటి?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 06:04 PM

విజయవాడలోని జక్కంపూడి పరిధిలో 132 ఎకరాల ఖాళీ ప్లాట్లలో యాసిడ్ డంప్ చేయడంపై అక్కడి ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో ఓ ట్యాంకర్ డ్రైవర్‌ను పట్టుకుని అక్కడి ప్లాట్ ఓనర్లు పోలీసులకు అప్పగించారు. వైజాగ్ నుంచి యాసిడ్ తీసుకుని ట్యాంకర్లలో తరలించి, అక్కడి ప్లాట్లలోని మట్టిలో ప్రమాదకరమైన రసాయనాలు వేస్తున్నారని ప్లాట్ యజమానులు చెబుతున్నారు. ఈ కేసులో క్రెబ్స్ బయోకెమికల్స్ అనే కంపెనీ పేరుతో ట్యాంకర్లలో యాసిడ్ తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో తమ ప్లాట్లలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను చూసిన ప్లాట్ ఓనర్లు వాటిని అడ్డుకున్నారు.ప్రముఖ రసాయన సంస్థ క్రెబ్స్ బయోకెమికల్స్ నుంచి వచ్చిన ఈ ట్యాంకర్లు, వైజాగ్ నుంచి ఔషధ రూపంలో ఉండే హానికరమైన యాసిడ్‌ను తీసుకెళ్లి, జక్కంపూడి ప్రాంతంలోని కొన్ని ఖాళీ ప్లాట్లలో పూడ్చే యత్నం చేశారని ఓనర్లు చెబుతున్నారు. ఈ డంపింగ్ వల్ల ఆ ప్రాంతంలోని గాలితోపాటు నీరు కూడా విషపూరితం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతోపాటు పర్యావరణం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అక్కడి నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com