నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి మరోసారి రానున్నారు. సుమారు రూ.42 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రావాలని సీఎం చంద్రబాబు ఆయన్ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని కార్యాలయం (పీఎంవో) వర్గాలు ఆమోదించినప్పటికీ.. నిర్దిష్టమైన తేదీని ఖరారు చేయలేదు. అయితే ఏప్రిల్ 15-20 తేదీల నడుమ ఏదో ఒక రోజు ఆయన వస్తారని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అధికారిక షెడ్యూల్ విడుదల కానప్పటికీ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయానికి వెనుకవైపు ఎన్-9 రోడ్డుకు పశ్చిమంగా ఉన్న ప్రాంతాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సదరు ప్రాంగణాన్ని ఆదివారం నుంచి చదును చేయడం మొదలుపెట్టారు.
![]() |
![]() |