ఇల్లు కట్టి చూడు-పెళ్ళి చేసి చూడు అంటుంటారు పెద్దలు. అంటే ఈ సామెత రావడానికి ముఖ్య కారణం.. ఇవి రెండు చేశారంటే.. జీవితంలో మంచి హోదాలో ఉన్నట్లని అర్థం. అందుకే ఇవి రెండు చేయడం జీవితంలో కష్టమైన పనులు. ఇల్లు కట్టి.. ఇంట్లో పిల్లలకు పెళ్లి చేశారంటే.. అతడి బాధ్యతలు చాలా వరకు తీరినట్లే. అయితే ప్రస్తుతం పెళ్లి చేయడానికి, ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చులు మాటల్లో చెప్పలేనివి. పెరుగుతున్న ఖర్చులకు తోడు.. కూలీ రేట్లు కూడా అంతే ఉంటున్నాయి. దీంతో ఇల్లు కట్టేందుకు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ల పథకాలను ప్రవేశపెడుతున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు అవుతుండగా..కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం ఆవాస్ యోజన పథకం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.
ప్రభుత్వాలు ఎంత సాయం చేసినా.. ఇల్లు కడితే మాత్రం సొంతంగా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటివి ఏవి లేకుండా.. ప్రభుత్వమే తమ దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటే.. రూ.92 లక్షల నజరానా ఇస్తే ఎలా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి.. ఆ డబ్బులతో అలాంటి ఇల్లులు మనం ఎన్ని నిర్మించుకోవచ్చు..? అయితే ఇలాంటి ఆఫర్ ఒక దేశం కల్పిస్తోంది. మన దేశంలో కాదులేండి.. ఇటలీలో. అవును మీరు విన్నది నిజమే ఇటలీ ప్రభుత్వం.. తమ గ్రామాల్లో స్థిరపడే వారికి ఈ నజరానాను ప్రకటించింది.
అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదని కూడా ప్రకటించింది. ఇటలీ వాసులు, విదేశాల్లో ఉన్న ఇటాలియన్లకు మత్రమే ఈ ఆఫర్ అని చెప్పింది. ఉత్తర ఇటలీలో ట్రెంటినో ప్రావిన్సు ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతుండటంతో.. అక్కడ గ్రామాల్లో ఎవరూ ఉండటం లేదు. అక్కడ అన్నీ పాడుబడిన ఇళ్లే కనిపిస్తున్నాయి తప్ప.. జనాలు ఉండటం లేదు. దీంతో జనాభా తగ్గి.. ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఆయా గ్రామాలు. దాదాపు ఇలా 33 ప్రాంతాలు ఈ ముప్పు ఎదుర్కొటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
అయితే జనాభాను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఇలాంటి ప్రోత్సాహాన్ని ప్రకటించింది. ఇప్పటికే దీనికి బడ్జెట్లో కేటాయింపులు చేయగా.. ఈ ప్రాజెక్టు తుది ఆమోదం త్వరలోనే పొందే అవకాశం ఉంది. దీనికి అర్హులుగా 45 ఏళ్ల లోపు వారు ఉండాలని పేర్కొన్నారు. ఇది కేవలం ఇటలీవాసులతోపాటు విదేశాల్లో ఉన్న ఇటాలియన్లకు మాత్రమేనని అన్నారు. రూ.92 లక్షల్లో రూ.74లక్షలు ఇంటి పునరుద్ధరణకు, మిగిలిన డబ్బులు ఇంటి స్థలం కొనుగోలుకు ఉపయోగించాలన్నారు.
![]() |
![]() |