ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు,,,బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం

international |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 07:15 PM

గతేడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవిని వీడి.. భారత దేశానికి పారిపోయి వచ్చి, ఇక్కడే ఆశ్రయం పొందుతున్న విషయం అందిరకీ తెలిసిందే. అయితే ఆ తర్వాత నుంచి బంగ్లాదేశ్ పరిస్థితి మరింత దిగజారిపోతూ వస్తోంది. ముఖ్యంగా అశాంతి, దాడులు, హింసతో నిత్యం అక్కడ గొడవలు జరుగుతుండగా.. తాజాగా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అక్కడి ఆర్మీ వర్గాలు అత్యవస సమావేశం నిర్వహించాయి. మరి అందులో ఏ అంశాల గురించి చర్చించాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


రిజర్వేషన్ల కోటా విషయంలో బంగ్లాదేశ్‌లో తీవ్ర దుమారం రేగగా.. 2024 ఆగస్టు నెలలో నిరసనకారులు ప్రధాని ప్యాలెస్‌ను చుట్టుముట్టారు. దీంతో భయపడిపోయిన ఆ దేశ ప్రధాని షేక్ హసీనా.. 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి ఆగస్టు 5వ తేదీన ఆ భారత దేశానికి పారిపోయి వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడే ఆమె ఆశ్రయం పొందుతుండగా.. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయనే దేశాన్ని పాలిస్తున్నారు.


అయితే యూనస్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆ దేశ పరిస్థితి మరింత దిగజారిపోతూ వచ్చింది. ముఖ్యంగా షేక్ హసీనాను తిరిగి దేశానికి రప్పించుకునేందుకు భారత్ తో గొడవకు దిగుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్, చైనాలతో చేతులు కలిపి.. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌ను గద్దె దింపాలని ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ అనుకూల వ్యక్తిగా పేరొందిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుల్ రెహ్మాన్‌ను ఆ పదవిలోకి తీసుకురావాలని భావించింది. ఈక్రమంలోనే ఆర్మీ చీఫ్.. మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ఈ విషయం గురించి చర్చించేందుకే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరప్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, 8 మంది మేజర్ జనరల్స్ సహా ఇతర ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు. ముహమ్మద్ యూనస్ అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వంపై దేశ ప్రజల్లో అశాంతి, అపనమ్మకం ఎక్కువ అయ్యాయని ఆర్మీ వర్గాలు వివరిస్తున్నారు.


దీంతో దేశంలో రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని.. అందుకే దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉండాలని సమావేశంలో చర్చించినట్లు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే వీళ్లే యూనస్ సర్కారుపై తిరుగుబాటు చేస్తారని అర్థం అవుతోంది. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com