ఉత్తర్ప్రదేశ్లోని హాపూర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల గుడియా అనే మహిళకు ఇటీవల 14వ బిడ్డగా ఒక ఆడపిల్ల జన్మినిచ్చింది. ఆమె భర్త పేరు ఇమాముద్దీన్. గుడియ, ఇమాముద్దీన్ జంటకు ఇప్పటివరకు ఆమెకు 13 మంది పిల్లలు ఉండగా.. 14వ సంతానంగా ఆడ శిశువు పుట్టడంతో ఆ ఇంట ఆనందం ఉప్పొంగింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఇప్పుడు గుడియా వయసు 50 ఏళ్లు కాగా.. ఆమె పెద్ద బిడ్డ వయసు 22 ఏళ్లు. ఇటీవల గుడియాకు 9 నెలలు నిండక ముందే పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అంబులెన్స్లో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునే లోపే గుడియాకు ప్రసవం జరిగి ఆడపిల్ల పుట్టింది.
తాజాగా గుడియా తనకు పుట్టిన 14వ బిడ్డతో కలిసి ఉన్న ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటో, వీడియోల్లో గుడియా పక్కన ఆమె పెద్ద బిడ్డ కూర్చుని ఉండటం గమనార్హం. అయితే గుడియా మాత్రం తనకు మొత్తం 9 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని తెలిపింది. నలుగురు అబ్బాయిలు.. ఐదుగురు అమ్మాయిలు మాత్రమే తనకు పుట్టారని చెప్పింది. అందులో ముగ్గురు చనిపోయారని స్థానిక మీడియాకు వెల్లడించింది. తనకు 14 మంది పిల్లలు ఉన్నారని ఎవరు చెప్పారని.. అది అంతా అబద్ధమని గుడియా కొట్టిపారేశారు. కానీ గుడియాకు ఇటీవల 14వ బిడ్డ పుట్టిందని.. ఇంతకు ముందు 13 మంది పిల్లలు ఉన్నారని.. ఆ ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
![]() |
![]() |