వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఫోన్ కాల్ డేటాను బయటపెట్టిన ప్రధానోపాధ్యాయురాలును సస్పెండ్ చేసారు. ఎమ్మెల్యే రజిని తనకు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణను ఇతరుల వద్ద వినిపించినందుకు హెచ్ఎం ధనలక్ష్మిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆదేశాలిస్తే ఆ సంభాషణను ఇతరులకు వినిపించడాన్ని ఎమ్మెల్యే సీరియస్గా తీసుకున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రధానోపాధ్యాయురాలిపై వేటు పడింది. చిలకలూరిపేట పట్టణంలోని శారదా హైస్కూల్ కమిటీ నియామక విషయమై ఏర్పడిన వివాదం హెచ్ఎం సస్పెన్షన్కు కారణమైనట్లు తెలుస్తోంది. కమిటీ నియామకంపై కొద్దికాలంగా వివాదం నడుస్తోంది. ఆ వివాదంలో ఎమ్మెల్యే రజిని జోక్యం చేసుకుని ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్ చేసి కమిటీని రద్దు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలు అందుకున్న హెచ్ఎం అదే విషయాన్ని కమిటీకి కూడా తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడిన సంభాషణను రికార్డు చేసి కమిటీకి వినిపించారు.ఫోన్ కాల్ రికార్డు చేసి ఆ సంభాషణను కమిటీకి వినిపించడంపై ఎమ్మెల్యే రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ డేటా లీక్ చేయడంపై ఆమె విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ సదరు హెచ్ఎంపై చర్యలకు ఉపక్రమించింది. ఫోన్ సంభాషణలను లీక్ చేయడాన్ని విద్యాశాఖ సీరియస్గా పరిగణించింది. తక్షణమే హెచ్ఎం ధనలక్ష్మిపై సస్పెన్షన్ వేటు వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa