ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టును తరలించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అడ్వొకేట్స్‌ జేఏసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 10:07 AM

విజయవాడ : హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు కోర్టు విధులను బహష్కరించి నిరసన తెలపాలని అడ్వొకేట్స్‌ జేఏసీ తీర్మానించింది. ప్రతిరోజూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈనెల 24న ‘చలో హైకోర్టు’ చేపట్టాలని నిర్ణయించింది. ఆదివారం విజయవాడలో నిర్వహించిన బెజవాడ బార్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa