ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెక్ట్ స్టాక్‌ను ఎంపిక చేసుకోవాలి. లేదంటే నష్టాలే

business |  Suryaa Desk  | Published : Tue, Jan 11, 2022, 12:09 PM

షేర్ మార్కెట్ అదో మాయాజాలం. ఇక్కడ లాభపడాలంటే తాము వేచ్చించే కంపెనీ యోక్క బ్యాక్ గ్రౌండ్ తెలసి ఉండాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదముందన షేక్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి జాబితాలో ఇటీవల ఓ షేర్ కంపెనీ చేరింతని చర్చ సాగుతోంది. షేర్ మార్కెట్‌లో చాలా స్టాక్స్ ఉంటాయి. అయితే అన్ని షేర్లు ఒకే రకమైన లాభాన్ని మాత్రం అందించవు. కొన్ని షేర్లు భారీ రాబడిని అందిస్తే.. కొన్ని షేర్లు మాత్రం నష్టాలను కూడా మిగిలిస్తూ ఉంటాయి. అందుకే ఈక్విటీ మార్కెట్‌లో డబ్బులు పెట్టేటప్పుడు కరెక్ట్ స్టాక్‌ను ఎంపిక చేసుకోవాలి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. మల్టీ బ్యాగర్ షేర్లు ఎంచుకుంటు.. మంచి రాబడి పొందొచ్చు. ఇలాంటి షేర్లలో జీఆర్ఎం ఓవర్సీస్ కూడా ఒకటి. ఈ షేరు ఇన్వెస్టర్ల పంట పండించిందని చెప్పుకోవచ్చు. కేవలం ఏడాది కాలంలోనే ఇన్వెస్టర్లకు భారీ లాభాన్ని అర్జించి పెట్టింది. రూ.లక్ష పెట్టుబడికి ఏకంగా రూ.21 లక్షల లభాన్ని అందించింది. జీఆర్ఎం ఓవర్సీస్ అనేది ప్రధానంగా బాస్మతి రైస్‌ను తయారు చేస్తుంది. ఈ షేరు ధర కేవలం మూడు నెలల్లోనే 300 శాతం ర్యాలీ చేసింది. 2021 అక్టోబర్ నెలలో రూ.209 వద్ద ఉన్న షేరు ధర ఇప్పుడు రూ.815కు పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఒకటుంది. జీఆర్ఎం ఓవర్సీస్ కంపెనీ ఈకామర్స్ సంస్థ ఉడాన్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో షేరు ధర పరుగులు పెట్టింది. అదే షేరు ధరను గత నెలల కాలంలో పరిశీలిస్తే.. రూ.459 నుంచి రూ.815కు పెరిగింది. అదే ఆరు నెలల కాలంలో చూస్తే.. షేరు రూ.160 నుంచి రూ.815కు చేరింది. అదే ఏడాది కిందట అయితే షేరు ధర రూ.38గా ఉండేది. అంటే అప్పటి నుంచి చూస్తే స్టాక్ ధర 2 వేల శాతం ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు జీఆర్ఎం ఓవర్సీస్ షేరులో నెల రోజుల కింద రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.1.75 లక్షలు అయ్యి ఉండేది. ఆరు నెలల కింద రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు రూ.5 లక్షలు వచ్చేవి. అదే ఏడాది కిందట రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు రూ.21 లక్షలు పొందే వారు. ఇకపోతే స్టాక్ మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుంది. అందువల్ల డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa