పశ్చిమ గోదావరి జిల్లాలో పది మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు వారి వారి స్థాన చలనాలు ఇలా ఉన్నాయి. ఏలూరు టూ టౌన్ ఎస్ఐ గా పనిచేస్తున్న బత్తిన నాగబాబును పెదపాడు ఎస్సై గా బదిలీ చేసి, పెదపాడు లో పనిచేస్తున్న జ్యోతి బసునీ వి ఆర్ కు తరలించారు. చింతలపూడి ఎస్సై గా పని చేస్తున్న స్వామినిఅత్తిలి ఎస్సైగా బదిలీ చేసి, అక్కడ పనిచేస్తున్న చెన్నారావు ను విఆర్ కు తరలించారు, కృష్ణా జిల్లా వీరవల్లి ఎస్సై గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంను చింతలపూడి ఎస్సైగా నియమించారు. ప్రస్తుతం విఆర్లో ఉన్న చావా సురేష్ ను దిశా ఎస్సైగా బదిలీ చేశారు.
దిశగా ఎస్ఐ గా బదిలీ అయిన చాలా సురేష్ ఏలూరు నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఎస్సై టి వి జి రాజు ప్రస్తుతం వి ఆర్ లో ఉండగా ఆయనను భీమవరం సీసీఎస్ కు బదిలీ చేశారు. కొరివి రామకృష్ణ వి ఆర్ లో ఉండగా ఆయనను గోపాలపురం కు బదిలీ చేశారు. వాసంశెట్టి సుబ్రహ్మణ్యం గోపాలపురంలో పనిచేస్తున్న ఆయనను తాడేపల్లిగూడెం ట్రాఫిక్ కు కొద్దికాలం క్రితమే అటాచ్మెంట్ చేశారు. పూర్తి స్థాయి బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. వేముల వెంకటేశ్వరరావు ప్రస్తుతం భీమవరం వన్ టౌన్లో పనిచేస్తూ ఉండగా ఆయనను గణపవరం బదిలీ చేశారు. మరికంటి వీరబాబు ప్రస్తుతం గణపవరం లో పనిచేస్తూ ఉండగా ఆయనను తణుకు పట్టణ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa