ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుల్లి తెర నటి ఆత్మహత్య

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 23, 2020, 01:51 PM

సీరియల్ నటి మద్దెల సబీరా అలియాస్ రేఖ ఆత్మహత్యకు పాల్పడింది. సబీరా రెండు సీరియళ్లలో నటించింది. ఆర్దిక పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. పూర్తి వివరాలిలా ఉన్నాయి.గుంటూరు జిల్లా విద్యానగర్ కు చెందిన సబీరా గాయనీగా రాణించాలనే ఉద్దేశ్యంతో కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చింది. గాయనీగా రాణిస్తూనే రెండు టీవీ సీరియల్స్ లో నటించే అవకాశాన్ని పొందింది. ఇంతలో అహమ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఓ కూతురు పుట్టింది. ఆ తర్వాత పలు కారణాలతో భర్తతో విడిపోయింది. కొన్నాళ్లకు కాజవాసి చైతన్యను రెండో పెళ్లి చేసుకుంది. సీరియల్స్ లో అవకాశం లేక గాయనీగా ఆఫర్లు రాకపోవడంతో సొంతూరు గుంటూరు విద్యానగర్ కు సబీరా మకాం మార్చింది. ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకలకు యాంకరింగ్ చేస్తూ పాటలు పాడుతూ విద్యానగర్‌లో జీవనం సాగిస్తూ వస్తోంది.ఇటీవల సీరియళ్లలో నటించేందుకు ప్రయత్నించినా అవకాశాలు రాలేదని తెలుస్తోంది. సబీరా భర్త చైతన్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఇటీవల వ్యాపారంలో నష్టం రావడంతో వీరు అప్పుల్లో కూరుకుపోయారు. గత కొద్ది రోజులుగా సబీరా తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. బుధవారం స్నానం చేస్తానని బాత్రూంలోకి వెళ్లి ఎంత సేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి చూడగా సబీరా బాత్రూంలో ఉరేసుకొని ఉంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు సినీ రంగంలో రాణించలేక,ఇటు అప్పుల బాధ తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa