సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది హీరోయిన్ హెబ్బా పటేల్. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు వచ్చే అవకాశాలు హిట్ లేకపోయినా తెలుగు సినిమాల నుంచి దాదాపుగా కనుమరుగైపోయింది. ఈ మధ్య కాలంలో బొద్దుగా ఉన్న ఈ అమ్మడు తాజాగా దర్శనమిచ్చింది. ఆమెకు శస్త్ర చికిత్సలు జరిగాయని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. అందం కోసం బాడీ ట్రాన్స్ఫార్మింగ్ సర్జరీ చేయించుకున్నట్లు నిర్ధారించారు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్ చేసే ఈ భామ.. ఓ మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa