ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సినిమా నిజానికి .. భ్రమకి మధ్య ప్రేక్షకులను అయోమయానికి గురిచేసింది

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2019, 12:16 PM

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'వన్ నేనొక్కడినే' సినిమాను గురించి మాట్లాడారు. "ఈ సినిమాలో కథా బీజం .. గోల్డెన్ రైస్ తాలూకు విత్తనం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని పంటను అందించే ఈ విత్తనం గురించే కథ సాగుతుంది. కథాబీజం కథాంశమై .. ఆ కథావస్తువు కథనం ద్వారా పెరగడమనేది స్క్రీన్ ప్లే లక్షణం.

మీరు గమనిస్తే 2 గంటల 54 నిమిషాల ఈ సినిమా నిడివిలో, చివరి 2 నిమిషాలు కథాబీజం .. కథావస్తువు చెప్పబడ్డాయి. ఆడియన్స్ థియేటర్లో నుంచి లేచి వెళ్లిపోతోన్న సమయంలో, ఆ సినిమాలో కథ వస్తువేదో .. కథాంశమేదో చెప్పబడింది. ఇది కరెక్ట్ కాదు .. ఇది ముందుగానే వచ్చేయాలి. ఈ సినిమా నిజానికి .. భ్రమకి మధ్య ప్రేక్షకులను ఉయ్యాలలూగిస్తూ అయోమయానికి గురిచేసింది. ఇక అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేశాయి. అందువల్లనే కథతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు" అని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa