|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:33 PM
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఊర్కొండ మండల పరిధిలోని జగబోయినపల్లి గేటు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆటో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.