|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:07 AM
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. తెల్లాపూర్ చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువును మట్టితో పూడ్చి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే ఫిర్యాదుతో అధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా పోసిన మట్టిని తొలగించారు. ఇలా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.