లోక్ సభ ఎన్నికలు ముగియటంతో.. పథకాల అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. ఫలితాలు విడుదలైన వెంటనే పథకాలు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ మేరకు.. నిధులు కూడా సమకూరుస్తోంది. అయితే.. ముఖ్యమైన పథకాల్లో ఒకటైన.. కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.725 కోట్లకు ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు కూడా విడుదల చేశారు.
ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా.. కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు.. తులం బంగారం కూడా ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకే నిధులు కూడా విడుదల చేసినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా.. లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా ఇచ్చేందుకు.. ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. ఈ మేరకే ఇప్పుడు నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది.
కళ్యాణ లక్ష్మీ పథకం అమలు కోసం.. రాష్ట్రంలో ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా అంతే ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు ఈ పథకాన్ని అమలు చేయట్లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ పథకాన్ని అమలు చేయటాన్ని సవాలుగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ మేరకు నిధులు విడుదల చేసినట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa