పని ప్రదేశాల్లో వైద్యుల భద్రత కోసం విధివిధానాలను రూపొందించేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది. కోల్కతాలోని ఆర్జి కర్ వైద్య కళాశాల & ఆస్పత్రిలో జరిగిన 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసుపై గురువారం నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa