నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు వాయుగుండం తుపానుగా ఏర్పడబోతుందని హెచ్చరించారు. ఈ తుపానుకు 'ఫెంగల్' తుపానుకుగా నామకరణం చేశారు. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణం మారిపోయిందని అన్నారు. ఉత్తర- వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ నేడు తుపానుగా మారుతుందని చెప్పారు. మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారి తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లొచ్చునని చెప్పారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఫెంగల్ తుపాను ప్రభావంతో దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఒక్రటెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. నాలుగైదు రోజులపాటు విపరీతంగా చల్లగాలులు వీచనున్నాయని అన్నారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, ఈనెల 28, 29న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అలర్ట్ జారీ చేశారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల 8 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లోని చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లలాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం దట్టమైన పొగమంచు ఉంటుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. రానున్న 4 రోజులు చలి తీవ్రత పెరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa