కాంగ్రేస్ సర్కారుపై బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ 2లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని 50% మందికి కూడా పూర్తి చేయలేదు. 2లక్షల పైన రుణం ఉన్న రైతులు మిగతా డబ్బులు బ్యాంకులకు చెల్లించారు..రుణమాఫీ అవుతుందనుకుంటే రైతులు మళ్ళీ అప్పులపాలయ్యారు.రైతు భరోసా 15 వేలు ఇస్తామని 12 వేలకు తగ్గించారు..వాయిదాలతో కాలం వెల్లదీస్తున్నారు. పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారు.నేటికి రైతుభరోసా రైతుల ఖాతాల్లో జమ కాలేదు.రాజ్యాంగం అమలైన రోజు హామీలు అమలు చేస్తామని మాట తప్పి పవిత్రమైన రాజ్యాంగాన్ని,జనవరి 26 ను అపవిత్రం చేసారు.ఎకరాకు 500 బోనస్ బోగస్ బోగస్ గా మారింది.అన్ని పంటలకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించి కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 86,40,000 క్వింటాళ్ళ దాన్యానికి సంబందించిన 432 కోట్ల రూపాయల బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయి.ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాక రైతులు అదికారుల చుట్టూ తిరుగుతున్నారు..రెండో పంటకు సిద్దం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ అదికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రైవేట్ మార్కెట్ లో 3000 రూపాయల వరకు దర ఉన్నా బోనస్ కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి దాన్యాన్ని విక్రయించారు.ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ జమచేయకపోవడం దుర్మార్గమైన చర్య. కేసీఆర్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. సమయానికి పెట్టుబడి,కరెంట్,నీళ్ళతో వ్యవసాయం పండగైంది. కాంగ్రేస్ పాలనలో వ్యవసాయం దండగలా మారింది.కాంగ్రేస్ అనాలోచిత నిర్ణయారతో రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు వెంటనే బోనస్ డబ్బులు చెల్లించాలి. 2 లక్షల రుణమాఫీ,ఎకరానికి 15 వేల రూపాయల రైతుభరోసా,అన్ని పంటలకు బోనస్,కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ హామీలను పూర్తి చేసి గ్రామాల్లోకి రావాలి..లేదంటే ప్రజాతిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం. మీ బూటకపు 420 హామీలు,బోగస్ గా మారిన బోనస్ లను ప్రజలు గమనిస్తున్నారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న బోనస్ డబ్బులను విడుదల చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa