ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లికి చెందిన జంగం మహేశ్గా ఐడెంటిఫై చేశారు. రైలులో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని ఫోటో ఆధారంగా బాధితురాలు గుర్తించింది.
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే ఏడాది క్రితమే మహేశ్ను అతని భార్య వదిలేసింది. అతని తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేశ్ ఒంటరిగా ఉంటున్నాడు.
![]() |
![]() |