ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

national |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 06:23 PM

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. గత వారంలోనే రెండు సార్లు ఎన్‌కౌంటర్ జరపగా.. అనేక మంది మావోయిస్టులు హతం అయ్యారు. ఒకరోజు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ సహా 24 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఇక అదే రోజు రెండో సారి జరిగిన కాల్పుల్లో ఆరుగుగు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. అయితే తాజాగా మరోసారి భద్రతా బలగాలు దంతెవాడ జిల్లాలో ఎదురు కాల్పులు జరపగా.. ముగ్గురు మావోయిస్టులు హతం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నట్లు పోలీసులు, భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో రెండు జిల్లాల నుంచి సంయుక్త బలగాలు మంగళ వారం రోజు ఉదయం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 8 గంటలకే ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం అయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.


అలాగే ఘటనా స్థలం వద్ద నుంచి మావోల మృతదేహాలతో పాటు తుపాకీలు, పేలుడు పదార్థాలు, మందుగుండ సమాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే నక్సల్స్ కేడర్ల మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉండగా.. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపారు. ఇప్పటికీ ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.


ఇదిలా ఉండగా.. ఐదు రోజుల క్రితమే అంటే మార్చి 20వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఎదురు కాల్పులు జరిపారు. రెండు జిల్లాలకు చెందిన సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేశారు. ఈక్రమంలోనే ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో ఓ జవాన్ కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. అలాగే పోలీసులు చేసిన ఎదురు కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు హతం అయ్యారు. అదేరోజు మరోసారి కాల్పులు జరపగా మరో ఆరుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు.


ఈ ఏడాది ఇప్పటి వరకు అనేక సార్లు ఈ ప్రాంతంలో ఎన్ కౌంటర్లు జరిగాయి. ఫలితంగా 116 మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2026 వరకు దేశాన్ని పూర్తి మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు ఈ కాల్పులు జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com