కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హత్యాచార ఘటన గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఘటన జరిగి చాలా రోజులు కాగా.. ఓ నిందితుడిని నేరస్థుడిగా గుర్తించిన న్యాయస్థానం జీవితఖైదు కూడా విధించింది. అయితే తాజాగా ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బాధితురాలు హత్యాచారానికి గురి కావడానికి నెల రోజుల ముందే తీవ్ర మానసకి ఒత్తిడికి గురై.. ఓ సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్లిందట. ఆసుపత్రిలో అవకవతవకలు జరుగుతున్నాయని తాను బయట పెట్టగా.. తనను టార్గెట్ చేశారని వివరించిందట. ప్రస్తుతం సైకియాట్రిస్టే బయటకు వచ్చిన బాధితురాలు తనతో చెప్పిన మాటను మీడియాముఖంగా వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
2024 ఆగస్టు 9వ తేదీన నార్త్ కోల్కతాలోని ఆర్జీ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న మరుసటి రోజే పోలీసులు దోషిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సంజయ్ రాయ్ను అదుపులోకి తీసుకోగా కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ఆమె ఒంటిపై అనేక మంది డీఎన్ఏ ఉన్నట్లు గుర్తించింది. కానీ ఒక్కరే హత్యాచారం చేశారంటూ నివేదిక ఇవ్వగా.. సంజయ్ రాయ్ను నేరస్థుడిగా తేలుస్తూ జీవితఖైదు విధించింది.
అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ సర్కార్ నిందితుడికి మరణ శిక్ష వేయాలంటూ పిటిషన్ వేయగా.. విచారించిన ధర్మాసనం బాధితురాలిపై జరిగింది హత్యాచారామా, సామూహిక అత్యాచారామా అనేది తేల్చి చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఆర్జీకార్ బాధితురాలు హత్యాచారానికి గురయ్యే నెల రోజుల ముందే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందిని సైకియాట్రిస్ట్ మోహిత్ రణదీప్ చెప్పారు. ఈక్రమంలోనే ఆమె తనను కలిసిందని వివరించారు. ఆస్పత్రిలో జరుగుతున్న అవకతవకల గురించి తనకు చెప్పిందని పేర్కొన్నారు.
సుదీర్ఘ డ్యూటీ గంటలు, వివక్షతో కూడిన షిఫ్ట్ కేయింపులు, ఆసుపత్రిలో జరిగిన అవకతవకల గురించి తనకు తెలిసినప్పటి నుంచి ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు వివరించారు. అందరికీ ఇలాంటి ఫిష్టులే వేస్తారా అని ఆమెను అడగ్గా.. లేదని చెప్పిందని, తనను మాత్రమే ఇలా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నట్లు ప్రముఖ బెంగాలీ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె తల్లిదండ్రులు సైతం ఆసుపత్రి మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలను బహిర్గతం చేసినందుకు ఆమెను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపించారు. ఈ ఆర్థిక అవకతవకలు సంబంధించి ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై ఆయన విడుదల అయ్యారు.
![]() |
![]() |