ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ 25 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు,,,దీదీ సర్కారుకు బిగ్ షాక్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 09:06 PM

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నిమాయక కుంభకోణం కేసులో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నియమాక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆ ప్రిక్రియ ద్వారా ఎంపికైన 25 వేల మంది ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే దీని ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లు ఇప్పటి వరకు పొందిన జీతాలను తిరిగి వాపసు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


2016 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్షను నిర్వహించింది. దీని ద్వారానే ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతు వరకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియమించుకోవాలనుకుంది. అయితే మొత్తంగా 24, 650 ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్ష పెట్టగా.. 23 లక్షల మందికిపైగా హాజరయ్యారు. ఇలా తుది ఎంపికలో మొత్తంగా 25 వేల 753 మందిని సెలెక్ట్ చేసుకుని.. వారికి అపాయింట్‌మెంట్ లెటర్లను పంపించింది. అయితే ఈ నియమాక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.


దీనిపై దర్యాప్తు చేపట్టాలంటూ అనేక న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈక్రమంలోనే సుప్రీం కల్గజేసుకుని ఈ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోల్‌కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసింది. అలా ఈ బెంచ్ సుదీర్ఘ విచారణ జరిపి.. నియామకాల్లో అవకతవకలు జరిగాయని తేల్చింది. అందుకే దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఎంపికనై వారందరినీ ఇంటికి పంపించి వేస్తూనే.. వారు తీసుకున్న జీతాలను సైతం తిరిగి ఇచ్చేయాలని తీర్పును ఇచ్చింది. అంతేకాకుండా ఆ నిమాయకాల స్థానంలో కొత్త ప్రక్రియ ప్రారంభించాలని చెప్పింది. దీంతో సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది.


నేడు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కోల్‌కతా హైకోర్టు తీర్పును సమర్థించింది. పశ్చిమ బెంగాల్ సర్కారు చేపట్టిన ఈ నియమాక ప్రక్రియలో అవకతవకలు జరగడం నిజమంటూనే వాటిని రద్దు చేస్తున్నట్లు తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా సీజేఐ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ కేసులో వాస్తవాలను పరిశీలించామని, మొత్తం ఎంపిక ప్రక్రియలో అవకతవకలు, మోసం ఉన్నాయని పేర్కొంది. అయితే వారందరి వద్ద నుంచి వేతనాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. అలాగే కొత్త ఎంపికను సైతం త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com