సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. స్కూలులో జరిగిన ఈ ప్రమాదంలో బాబుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడు త్వరగా కోలుకోవాలని, ఈ కష్ట సమయంలో పవన్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. "సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. బాబు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో పవన్ కుటుంబానికి బలం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని మంత్రి లోకేశ్ రాసుకొచ్చారు.
![]() |
![]() |