దేశ రైతులకు, ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవబోతున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక సగటు వర్షాపాతం 87 సెంటీ మీటర్ల కాగా.. ఈ సంవత్సరం మాత్రం 105 శాతం అధికంగా వర్షాలు పడతాయని వివరించింది. అలాగే ఈసారి ఎల్ నినో ఏర్పడే అవకాశం లేదని.. ఫలితంగా వర్షాలు విస్తారంగా కురిసి పంటలు బాగా పండే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఐఎండీ చెప్పిన ఈ వార్తతో దేశ ప్రజలు, రైతులంతా తెగ సంబుర పడిపోతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదు అవుతుందని మంగళవారం రోజు ఐఎండీ అంచనా వేసింది. మొత్తం సీజన్లో ఎన్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఐంఎండీ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లే కాగా ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదు అవుతుందని వివరించారు.
1971 నుంచి 2020 మధ్య కాలంలో దీర్ఘకాల సగటు 87 సెంటీ మీటర్లు మాత్రమే ఉందని.. భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షాపాతంతో సంబంధం ఉన్న ఎల్ నినో పరిస్థితులు ఈసారి అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు పడతాయని వెల్లడించారు. దీంతో దేశ ప్రజలంతా తెగ సంబుర పడిపోతున్నారు. మరోవైపు ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా రుతుపవనాల సమయంలో కురిసే వర్షాలపై తన నివేదికను వెల్లడించింది.
మార్చి వరకు వాతావరణ పరిస్థితులు, పలు అంశాలను విశ్లేషించిన తర్వాతే ఈ దీనిపై నివేదిక ఇచ్చింది. రాబోయే నైరుతి సీజన్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని చెప్పింది. ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో సగటున 868.6 మిల్లీ మీటర్ల వర్షం కురుస్తుందని పేర్కొంది. నైరుతి సీజన్ కాస్త నెమ్మదిగా ప్రారంభం అవుతుందని.. అయినా ఆ తర్వాత విస్తారంగా వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అలాగే పశ్చిమ, దక్షిణ భారత దేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నివేదిక ద్వారా వెల్లడించింది.
![]() |
![]() |