వైద్యుడిని 'నడిచే దేవుడు' అని ఎందుకు అంటారో నిరూపించే ఒక అద్భుత ఘట్టం కేరళలో చోటుచేసుకుంది. ఆసుపత్రి లేదు.. ఆపరేషన్ థియేటర్ లేదు.. కనీసం వైద్య పరికరాలు కూడా లేవు.. కానీ ఒక ప్రాణం మాత్రం కళ్లముందే కొట్టుమిట్టాడుతోంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ముగ్గురు వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి.. నడిరోడ్డునే ఆపరేషన్ థియేటర్గా మార్చేశారు. మొబైల్ ఫోన్ టార్చ్ వెలుతురులో అత్యవసర శస్త్రచికిత్స చేసి, ఒక వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు.
అసలేం జరిగిందంటే?
ఎర్నాకుళంకు చెందిన డాక్టర్ థామస్ పీటర్, ఆయన భార్య డాక్టర్ దిడియా థామస్ ఆదివారం ఉదయం చర్చికి వెళ్తుండగా.. పేరూర్ వద్ద ఒక రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని వారు గుర్తించారు. అక్కడే కొందరు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కూడా చూశారు. వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా.. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆ బాధితుడు ఆసుపత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం భయపడిపోయారు. ముఖ్యంగా అదే సమయంలో కోటయం మెడికల్ కాలేజీ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. మనూప్ కూడా అక్కడికి చేరుకున్నారు.
ఆంబులెన్స్ కోసం వేచి చూస్తే బాధితుడు బ్రతికే అవకాశం లేదని గ్రహించిన ఈ ముగ్గురు వైద్యులు.. అక్కడికక్కడే సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి అత్యాధునిక సౌకర్యాలు లేకపోయినా.. స్థానిక ప్రజలు, పోలీసుల సాయంతో బాధితుడికి రోడ్డు పక్కనే అత్యవసర చికిత్స ప్రారంభించారు. మొబైల్ ఫోన్ల టార్చ్ లైట్లను వెలుతురుగా వాడుకుంటూ.. కేవలం నాలుగు నిమిషాల్లోనే ఆ క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేసి బాధితుడిని నిలకడగా మార్చారు. అనంతరం అతడిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ గుండెలను హత్తుకునే ఘటనను.. కేరళ ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్ తన ఫేస్బుక్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ఈ కథనం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ మంచి పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా.. వృత్తి ధర్మాన్ని పాటించి ప్రాణాలు కాపాడిన డాక్టర్ థామస్, డాక్టర్ దిడియా, డాక్టర్ మనూప్లను ఆయన స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa