న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతుల వార్షిక పరీక్షల షెడ్యూల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదివారం విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21న ప్రారంభమై, మార్చి 29తో ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగుతాయి. వరుస పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు తగినంత సమయం ఇచ్చేలా ఏడు వారాల ముందుగానే సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. పోటీ పరీక్షలు, ఈ పరీక్షలు వేర్వేరు తేదీల్లో జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. గతేడాది జేఈఈ మెయిన్ పరీక్ష రోజే 12వ తరగతి ఫిజిక్స్ ఎగ్జామ్ కూడా రావడంతో సీబీఎస్ఈ ఫిజిక్స్ పరీక్ష తేదీని మార్పు చేయాల్సి వచ్చింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇక వొకేషనల్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ముందుగానే జరుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa