ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే ప్రధానిపై చంద్రబాబు విమర్శలు: కన్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 03:40 PM

 కేంద్ర ప్రభుత్వం సొమ్ముతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోకులు చేసుకుంటున్నారని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బండారం ఎక్కడ బయటపడుతుందనే భయంతో ప్రధాని మోదీ పర్యటనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మందు బాటిల్ నుంచి మరుగుదొడ్ల వరకు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి రాష్ట్ర పథకాలుగా చెప్పుకుని ప్రజలను మోసం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa