ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా రూపా గురునాథ్

national |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 04:19 PM

బిసిసిఐ మాజీ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టిఎన్‌సిఎ) అధ్యక్షురాలిగా ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. టిఎన్‌సిఎ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ రూపా గురునాథ్. బుధవారం జరిగిన టిఎన్‌సిఎ 87వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిఎన్‌సిఎ అధ్యక్షుడిగా ఆమె తండ్రి శ్రీనివాసన్ 2002 నుంచి ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆయనకు వాణిజ్య సంబంధాలు ఉన్న దృష్టా బిసిసిఐలో ఆయన ఏ పదవీ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. రూపా గురునాథ్ భర్త గురునాథ్ మెయ్యప్పన్ 2013లో ఐపిఎల్‌లో బెట్టింగ్‌కు బెట్టింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణపై అరెస్టు కూడా అయ్యారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం వరకు రూప నామినేషన్ మాత్రమే అధ్యక్ష పదవికి దాఖలైంది. టిఎన్‌సిఎ ఎన్నికలకు అక్టోబర్ 4 వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ లోపల ఎన్నికలు నిర్వహించినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతనే ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa