ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అభ్యర్థులకు షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 05:54 PM

ఆంధ్రప్రదేశ్ లో తాజాగా వెల్లడైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకం ప్రక్రియ రోజుకో గందరగోళాన్ని సృష్టిస్తోంది. మీరు ఉద్యోగాలకు ఎంపికయ్యారంటూ కాల్ లెటర్ పంపారు.. తీరా వచ్చాక మీరు ఈ ఉద్యోగాలకు పనికి రారంటూ చెపుతున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నియమకాల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం అభ్యర్థులకు ఏకంగా కాల్‌ లెటర్లు పంపించారు అధికారులు. తీరా అభ్యర్థులు వచ్చాక ఈ ఉద్యోగాలు లోకల్‌ వాళ్లకే, మీరు నాన్‌ లోకల్‌ అని తిరస్కరించారు. దీంతో వారంతా షాక్ కు గురయ్యారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన స్రవంతి 72.25 మార్కులు, నాగర్‌ కర్నూలుకు చెందిన ఉరుకొండ తేజశ్రీ 55.5, మహబూబ్‌నగర్‌ బి.సంపత్‌కుమార్‌ 66.5, నాగర్‌ కర్నూలు జిల్లా సాయికిరణ్‌ 64.2, వనపర్తి జిల్లా అభిలాష్‌ 73.75, నాగర్‌ కర్నూలు జిల్లాకు చెందిన పి.శివకుమార్‌ 77.5 మార్కులు.. ఇలా 44 మందిని నాన్‌లోకల్‌ కింద ఎంపిక చేస్తూ కాల్‌ లెటర్లు పంపించారు. అయితే నాన్‌లోకల్‌ కాబట్టి ఈ పోస్టులకు అనర్హులంటూ సర్టిఫికెట్ల తిరస్కరించారు.


దీంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా సెలక్షన్‌ కమిటీ కన్వీనర్‌ పుల్లారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇతర రాష్ట్రాల వారు అనర్హులైతే దరఖాస్తులను ఎందుకు స్వీకరించారు..? హాల్‌ టికెట్లు ఎందుకు ఇచ్చారు..? మెరిట్‌ లిస్టు వచ్చాక కాల్‌ లెటర్లు ఎందుకు పంపించారు అంటూ నిలదీశారు. అప్పుడు లేని నాన్ లోకల్ ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు తెల్లమొఖాలు వేసి సమాదానం చెప్పకుండానే అక్కడి నుండి జారుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa