వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన రోజా ఈ ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యిందని అది తట్టుకోలేక చంద్రబాబు చిన్న మెదడు చితికిందని అన్నారు. గతంలో తాము అధికారంలో ఉండి చేసిన తప్పుల కారణంగానే టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు.
అయితే కరకట్టపై చంద్రబాబు ఉన్న ఇంటిని కూల్చేయాలని హైకోర్ట్ చెప్పినా సిగ్గు లేకుండా ఆయన అక్కడే ఉన్నారని ఆరోపించారు. జగన్ అధికారం చేపట్టాక మంచిగా వర్షాలు పడ్డాయని, వరదల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ జగన్ అందిస్తున్న పథకాలకు, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నందుకు పక్క రాష్ట్రాల వారు కూడా జగన్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa