సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు 26న గురువారం నాడు విఐపి బ్రేక్ దర్శనాలు(ప్రోటోకాల్ దర్శనాలు కూడా) రద్దు చేయడమైనది.
డిసెంబరు 26న గురువారం నాడు ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అనగా డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. ఆలయశుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
అన్నప్రసాద భవనం మూత
గ్రహణం కారణంగా డిసెంబరు 25వ తేదీ రాత్రి 11 గంటల నుండి డిసెంబరు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ మూసివేయడం జరుగుతుంది. వంటశాల శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని కోరడమైనది.
ఆర్జిత సేవలు రద్దు
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa