భోపాల్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కును మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా కోల్పోయారు. ఎన్నికల సంఘం ఆయన ఓటుపై అనర్హత ప్రకటించింది. పెయిడ్ న్యూస్పై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి నరోత్తమ్పై ఎన్నికల సంఘం మూడేళ్ల వేటు వేసింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ఖర్చుపై మంత్రి వాస్తవాలు చూపని కారణంగా ఆయనపై వేటు వేశారు. తనకు ఓటు హక్కు కల్పించాలని మంత్రి నరోత్తమ్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. కానీ కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa