ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 25, 2021, 04:08 PM

విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి రూరల్ కొండదేవుపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చలిమంట కాచుకుంటూ.. నిప్పంటుకొని గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కథనం ప్రకారం.. బొంగు రాములమ్మ(80) తన ఇంటి వద్ద మంట కాచుకుంటుండగా చీరకు నిప్పంటుకుని శరీరమంతా కాలిపోయింది.


వెంటనే ఆమెను బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి 108వాహనంలో కుటుంబ సభ్యులు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విజయనగరం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా రాములమ్మకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa