ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 26, 2021, 04:05 PM

చిత్తూరు: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మదనపల్లె సీటీఎం గ్రామానికి చెందిన బి. సుజాత తన కుమారుడు గుణసాయి ( 24 )తో కలిసి బతుకుదెరువుకోసం వారం కిందట తిరుపతికి వచ్చారు. మంగళం బీటీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గుణసాయి క్షురక వృత్తిలో ఉండగా, తల్లి కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన గుణసాయి రోజూ సంపాదించే మొత్తాన్ని మద్యానికే ఖర్చుపెట్టేవాడు. ఆపై మరింత డబ్బు కావాలని తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లిని డబ్బు అడగడంతో ఆమె ఇవ్వలేదు. సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో తిరుపతి రూరల్ అవిలాల లింగేశ్వర్నగర్ కాపురం ఉంటున్న కుమార్తె దగ్గరకు సుజాత వెళ్లింది. రాత్రి తిరిగి ఇంటికొచ్చేసరికి తన కుమారుడు చీరతో ఉరేసుకుని కనిపించాడు. చుట్టుపక్కలవారి సాయంతో 108 వాహనం ద్వారా రుయాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై సుజాత అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa