సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటికి ముందస్తు రిజర్వేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి 50 శాతం అదనపు ఛార్జీలను నిర్ణయించారు. కృష్ణా రీజియన్ నుంచి ఈ సంక్రాంతికి మొత్తం 1, 266 సర్వీసులు నడపనున్నారు. ఇందులో పండుగకు ముందు. జనవరి, 7వ తేదీ నుంచి 17 వరకు తిప్పనున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన ముఖ్య పట్టణాలకు తిప్పనున్నారు.
హైదరాబాద్కు జిల్లా నుంచి మొత్తం 362 బస్సులు తిరగనున్నాయి. వీటిలో పండుగకు ముందు 212, తర్వాత. 150 వరకు నడుస్తాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంకు 390, బెంగళూరుకు 14, చెన్నైకు 20 బస్సులు చొప్పున తిప్పనున్నారు. కరోనా మహమ్మారి కాస్త శాంతించడంతో, ఈసారి పరిస్థితులు ఆశాజనకంగా ఉండొచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్పై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ సీజన్ కొంత సందిగ్ధత నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa