ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెను విషాదం.. అదృశ్యమైన బాలుడు శవమై తేలాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 27, 2021, 09:04 AM

గుంటూరు: ఇంటి నుంచి అదృశ్యమైన బాలుడు చివరకు కాల్వలో శవమై తేలిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పిడుగురాళ్ల మండలం జానపాడుకి చెందిన మిద్దె సంతోష్‌సాయికిరణ్‌ (13) ఈ నెల 22న ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆచూకీ కోసం అన్నిచోట్లా వెతికారు. ఫలితం లేకపోవడంతో బాలుడి తండ్రి వెంకట్రావు పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


తాజాగా ఆదివారం చేజర్ల వద్ద సాగర్‌ కుడి కాల్వలో ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. అది సంతోష్‌ సాయికిరణ్‌దిగా గుర్తించారు. అతను ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. సైకిల్‌పై వెళ్లిన తనయుడు చివరకు శవమై తేలడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa